Posted on 2026-05-30 17:15:14
డైలీ భారత్, కామారెడ్డి: మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
1. మహిళా సాధికారత – ఒక గొప్ప మార్పు…..
నాడు - నేడు: ఒకప్పుడు మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడే పరిస్థితి ఉండేది. కానీ నేడు పురుషులు తమ భార్యల పేర్లు చెప్పి, వారు ఏ సంఘంలో ఉన్నారో తెలియజేస్తూ లోన్ల కోసం అడిగే స్థాయికి మార్పు వచ్చింది. ఇది మహిళా సాధికారతకు ఒక నిదర్శనం.
₹535.30 కోట్ల పంపిణీ: బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఇంత భారీ మొత్తంలో రుణాలు అందించడం చాలా గర్వకారణం.
కాంగ్రెస్ ప్రభుత్వ చేయూత: గౌరవ మంత్రి సీతక్క గారు ప్రతి చిన్న సంఘానికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందించడం విశేషం.
1. రుణాల సద్వినియోగం & ఆర్థిక ప్రణాళిక
తీసుకున్న రుణాన్ని అప్పుల పాలు కాకుండా, కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎలా వాడాలో చైర్మన్ గారు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు:
50% వ్యాపార అవసరాలకు (Activity-Based): లోన్ మొత్తంలో సగం డబ్బును ఖచ్చితంగా ఏదైనా వ్యాపారం లేదా ఉపాధి మార్గాల కోసం పెట్టుబడిగా పెట్టాలి.
మిగతా 50% కుటుంబ అవసరాలకు (Consumption): మిగిలిన సగాన్ని పిల్లల చదువులు, వైద్యం మరియు నిత్యవసరాల వంటి ముఖ్యమైన వాటికి ఉపయోగించాలి.
వాయిదాల చెల్లింపు (Repayment): లక్ష రూపాయల రుణానికి నెలకు దాదాపు ₹4,000 వాయిదా (EMI) చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాయిదా కట్టడానికి మళ్లీ కొత్త అప్పులు చేయకూడదు. వ్యాపారం ద్వారా వచ్చే లాభాల నుంచే క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలి.
1. పిల్లల చదువు & తల్లే మొదటి గురువు
పిల్లలను ఉన్నత చదువులు చదివించి, రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దే బాధ్యత తల్లులపైనే ఉంది.
ఒక కుటుంబం బాగుండాలి అంటే అది మొదట తల్లితోనే ప్రారంభం అవుతుంది అని మహిళలు నిరూపించాలి.
1. మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు
అధికారులు కేవలం రుణాలు ఇవ్వడంతోనే తమ బాధ్యత ముగిసిందని అనుకోకూడదు.
మహిళలు చేసుకున్న MCP Micro Credit Plan - మైక్రో క్రెడిట్ ప్లాన్ అనగా (సూక్ష్మ రుణ ప్రణాళికఆధారంగానే )రుణాలు గ్రౌండ్ అయ్యేలా చూడాలి.
లోన్ తీసుకున్న వారు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో నిరంతరం గమనిస్తూ, వారు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా సిబ్బంది మార్గదర్శకత్వం వహించాలి.
"డబ్బు ఎంత తీసు కొన్నామన్నది కాదు, దాన్ని ఎంత క్రమశిక్షణతో వాడామన్నదే ముఖ్యం. మున్సిపాలిటీలోని ప్రతి కుటుంబం ఆర్థిక అక్షరాస్యత సాధించి ఒక మహావృక్షంలా మారినప్పుడే దేశంలో పేదరికం అంతమై అభివృద్ధి సాధ్యమవుతుంది." ప్రభుత్వ పథకాలు
1. ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు ఉచిత శిర ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది
2. అదేవిధంగా సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి వారికి నెలకు 69 వేల పైబడి ఏడు సంవత్సరాల వరకు ప్రతినెల వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా సమాఖ్యలను మెరుగుపరుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్
3. పెట్రోల్ బంకులు సమాఖ్య లకు ఇచ్చి ఆదాయాన్ని తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో ముందు మన తల్లి పై మనం ఎంత ప్రేమ చూపిస్తాము ఆలోచించి మీ అత్తమామలను కూడా అదే విధంగా చూస్తూ వారి వృద్ధాప్య జీవితానికి చేదోడు వాదోడుగా ఉండాలి అనాధ శరణాలకు షణార్ధి చెప్పి మన ఇంట్లోనే మనతోనే ఉంచుకొని వారితో కాసేపు మాట్లాడినట్లయితే వాళ్ళ ఆయుష్షును పెంచిన వాళ్ళము వారి ఆనందాలకు అవకాశం ఇచ్చిన వారిమవుతాము ఇలాంటి కార్యక్రమాలు మహిళలతో స్టార్ట్ అవుతే మహిళల పేరు మరి ఎక్కువగా మారుమోగుతాయి కావున ఇలాంటి వాటిని కూడా మనం అదుపులోకి తీసుకోవాలని తమరికి తెలియ పరుస్తున్నాను
ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాన్ని అందుకొని మీ కుటుంబాలు ఆనందముగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గీరి ,స్థానిక కౌన్సిలర్ గ్యార అఖిల,మెప్మా PD శ్రీధర్ రెడ్డి, TMC రవి శేంకర్, CO అనసూయ, రిసోర్స్ పర్సన్స్, పట్టణ సమాఖ్య కార్యవర్గ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >
బీబీపేట్ మండలం లోని మహేశ్వరి రైస్ మిల్లో ధాన్యం దిగుబడి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-05-29 12:17:49
Readmore >