డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండల బిసి సెల్ నాయకులు వెలిశాల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మండల కమిటీ లో అధిష్టానం ఏనుగుల వెంగళరావు ను గుర్తించి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఎవరికి అదరకుండా బెదరకుండా పార్టీ జెండాను తన భుజాలపై వేసుకుని కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకుడు వెంగళరావు,బిసి సమాజికవర్గాని చెందిన వెంగళరావు అన్ని కులాలకు సుపరిచితుడు గా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మండలంలో తన వంతు సహాయం అందిస్తూ ముందుంటాడు,కాంగ్రెస్ పార్టీ లో అన్ని అర్హతలు ఉన్న నాయకుడు వెంగళరావు అధిష్టానం వెంగళరావు కష్టాన్ని గుర్తించి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని బీసీ నాయకులు వెలిశాల రమేష్ తెలియజేశారు
News
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్