Posted on 2025-04-17 20:52:36
అక్రమ కేసులతో గాంధీల కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో బిజెపి రాజకీయ వేధింపులకు నిరసనగా ఈ.డి కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్నా తెలంగాణ రాష్ట్ర NSUI నాయకులు గొల్ల జాన్
డైలీ భారత్, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదును ఖండిస్తూ నిరసిసగా ఈరోజు హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,టీపీసీసీ ఇంచార్జ్ సెక్రటరీ విశ్వ నాథం,టీపీసీసీ టీపీపీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర NSUI నాయకులు గొల్ల జాన్ ధర్నాలో పాల్గోని మోదీ ప్రభుత్వని వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర NSUI నాయకులు గొల్ల జాన్ మాట్లాడుతూ. దేశం కోసం ప్రాణాలిచ్చే కుటుంబాన్ని కేసుల పేరుతో బెదిరిస్తున్నవా మోడీ?
నీ అక్రమ కేసులకు భయపడేటోళ్లు ఎవరూ లేరు!
ఈడీ వచ్చినా..మోడీ వచ్చినా తగ్గేదేలే... రాహుల్ గాంధీ పై పెరుగుతున్న ఆరాధన చూడలేక, రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక మా పార్టీ అగ్రనాయకులపై కక్షపూరిత కేసులు బనాయిస్తున్నారని అని అన్నారు..
బిజెపి ప్రభుత్వం,నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టే పనిలో ఉన్నారని అన్నారు..
స్వాతంత్ర సమరంలో త్యాగం చేసి, భారతదేశ సర్వసంపదను సమకూర్చినది కాంగ్రెస్ పార్టీ అన్నారు..
నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లును ఛార్జిషీట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు..
ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ కాంగ్రెస్ సభ్యులు,NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సేవదళ్ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >