Posted on 2025-04-17 18:39:47
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి డిమాండ్
ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50,000 ఇవ్వాలి
ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం పాల గుంపు గ్రామంలో ఇల్లు కాలిన ఆదివాసి కుటుంబాలను పరామర్శించిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి,వారు మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం ప్రమాదవశాస్తూ నాలుగు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి,నాలుగు కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయారు,స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కింద 50 వేల రూపాయలు అందించాలీ,ఇల్లు కాలిన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు శాంక్షన్ చేయాలీ,అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఫైర్ ట్యాంకర్ అందుబాటులో ఉండేలా చూడాలనీ తంబల్ల రవి డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు తోట రాజా,గంటా లక్ష్మణ్ రావు,పార్ధు,కేశవులు,తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >