Posted on 2025-02-14 12:59:03
డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రసూల్ పురా అన్నా నగర్లోని పలు చికెన్ సెం టర్లపై శుక్రవారం ఆరోగ్య, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు.
అన్నానగర్లోని ఓ చికెన్ దుకాణంపై ఫిర్యాదు అందగా.. ఆహార భద్రత టాస్క్ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికా రులు వెంటనే దాడులు జరిపారు.
ఎస్ఎస్ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ సెంటర్ లాంటి దుకాణాలపై దాడులు చేసి.. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కు వ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
మూడు నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుతు న్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికా రులు చెప్పారు. చికెన్ పాడవకుండా ప్రమాదకర మైన ఫార్మలిన్ కలుపుతు న్నట్లు నిర్ధారించారు.
బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారుల గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కుళ్లిన చికెన్ను పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్సు రద్దు చేసి.. వ్యాపారులపై కేసు నమోదు చేశారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >