Posted on 2025-02-11 22:06:35
డైలీ భారత్, అమరావతి: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతలకు 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చేలా చూడాలని బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. విచారణలో భాగంగా బ్యాంకుల నుంచి సైతం సమాచారం అవసరం ఉంటుందని, దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతుల అంశానికి సంబంధించి బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే వారికి కేవలం 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు నిర్దేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్తు అందించాలని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు 2 కిలోవాట్ల వరకు అందిస్తామన్న చంద్రబాబు.. తద్వారా ఉచిత విద్యుత్తు ఉత్పత్తితో పాటు.. మిగులు విద్యుత్తు ద్వారా వారు కొంతమేర అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఏపీలోనూ పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. ఉద్యాన పంటలు, ఇతర లాభదాయక పంటల వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, డెయిరీ, ఆక్వా రంగాలను మరింతగా ప్రోత్సహించాలి. పెట్టుబడి విషయమై బ్యాంకులకు వచ్చే అర్హులైన రైతులకు బ్యాంకులు సహకారం అందించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.
ఇప్పటివరకూ రూ. 5.34 లక్షల కోట్ల రుణాలు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు చెందిన వారికి ఏకంగా రూ.5.34 లక్షల కోట్ల వరకు రుణాలిచ్చాం. తమ టార్గెట్లో 99 శాతం సాధించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో యూనియన్ బ్యాంక్ సీఈఓ, ఎండీ మణిమేఖలై తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి రూ.2.64 లక్షల కోట్ల లోన్ టార్గెట్ కాగా, రూ.2.37 లక్షల కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగంలో రూ.3.37 లక్షల కోట్లకుగానూ ఇదివరకే రూ.3.26 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.79,905 కోట్ల రుణాలతో పాటు ప్రాధాన్యేతర రంగానికి సైతం రూ.2.08 లక్షల కోట్ల లోన్ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కోట్లాది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >