Posted on 2026-04-30 09:56:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యన్నపాలెం గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసు నమోదు అయిన కేసులో నిందితుడు బొప్పి నాగరాజు చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినారు.
ఈ కేసులో మృతురాలు బొప్పి పున్నేశ్వరి ను ఆమె భర్త అయిన నిందితుడు బొప్పి నాగరాజు తరచుగా మద్యం సేవించి, పేకాటలు మరియు కోడిపందాలకు అలవాటు పడి శారీరకంగా, మానసికంగా వేధించుచుండేవాడు. నిందితుడు మద్యం మత్తులో తన భార్యను తిట్టి అనుమానించి, కూరగాయలు కోసే కత్తితో ఆమెను పొడిచి తీవ్రంగా గాయపరిచినాడు.
గాయపడిన ఆమెను ఖమ్మం కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.
దర్యాప్తు సమయంలో ఈ రోజు నిందితుడిని పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా, నేరం జరిగిన విధానాన్ని వెల్లడించినాడు. నిందితుడు వెల్లడించిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన కూరగాయలు కోసే కత్తిని పంచుల సమక్షంలో పంచనామా ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అరెస్టు అనంతరం నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించి, గౌరవ కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూలూరుపాడు శ్రీలక్ష్మి తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >