Posted on 2023-08-29 15:35:53
హైదరాబాద్ : హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు మంగళవారం పోలీసులకు తెలిసింది,మహిళపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతురాలిని గౌలిదొడ్డిలోని కేశవనగర్కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం.
ఈ నెల 25 నుండి మహిళ కనబడటం లేదని పీఎస్లో మిస్సింగ్ కేస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >