Posted on 2024-10-02 11:59:12
బతుకమ్మ పండుగను మహిళలు అనందోత్సహాల మధ్య జరుపుకోవాలి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
డైలీ భారత్, కరీంనగర్: ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడ బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
నేటి నుంచి నుంచి 9 రోజుల పాటు జరుపుకునే పూల పండుగ, బతుకునిచ్చే బతుకమ్మ పండుగను
ఆడబిడ్డలు పూలను పూజిస్తూ , ప్రకృతిని ఆరాధిస్తూ అత్యంత వైభవంగా ఆనందోత్సహాల మధ్య జరుకోవాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు.
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయన్నారు. బతుకమ్మ సంబురాలు సందర్భంగా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. మహిళలు తీరోక్క పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసుకొని ఆటపాటలతో సంప్రదాయబద్దంగా సంబురాలు జరుపుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణ పల్లె పల్లెనా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకోవాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >