Posted on 2024-10-01 20:20:49
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ పాఠశాలలో మంగళవారం పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ ,బాలాత్రిపురసుందరి దేవి ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త ఆధ్వర్యంలో
సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు.సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ఈ బతుకమ్మ అద్దం పడుతోందని అన్నారు.పిల్లలు బతుకమ్మ పాటలుపాడుతూ, ఆడుతూ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రకృతితో మమేకమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మను పండుగను మన సంస్కృతి సంప్రదాయాలనుభావితరాలకు అందించాలని చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రపంచ నలుమూలల లో మన తెలంగాణ ఖ్యాతిని చాటాలని తెలియజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికిచేరి ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకరావాలని తెలియజేశారు. పిల్లల ఆనందం, సంతోషం కొరకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి,సౌజన్య,నీతూ శర్మ,రాజేష్, నర్మదా,రజిత, రాధ,ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి,సరిత, సంయుక్త, నవీన,అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >