| Daily భారత్
Logo




గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత

News

Posted on 2024-09-09 07:49:54

Share: Share


గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత

గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత

డైలీ భారత్, సూరత్: వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక మండపంపై రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సయ్యద్‌పురా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను వదిలిపెట్టబోమని, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్టు చేశారు.

సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురు వ్యక్తులను గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వీరితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సూరత్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >