Posted on 2024-09-09 11:19:54
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత
డైలీ భారత్, సూరత్: వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక మండపంపై రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సయ్యద్పురా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను వదిలిపెట్టబోమని, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్టు చేశారు.
సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురు వ్యక్తులను గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వీరితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సూరత్లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >