| Daily భారత్
Logo




ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

News

Posted on 2024-09-08 19:45:06

Share: Share


ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

డైలీ భారత్, హైదరాబాద్: మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను ఈరోజు తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 26 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు పరిధిలోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన షెడ్లు, భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలపర్వం కొనసాగుతుండగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మాదాపూర్ లో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు

నేడు హైడ్రా అధికారులు మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీనాపూర్ లలో ఏకకాలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారుల తీరుపైన భవన నిర్మాణాలు చేసుకున్న యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

దీంతో కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని బెదిరించారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుంటామని... అధికారులను హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. తాము పిల్లాపాపలతో ఉన్నాం ఎక్కడికి వెళ్లాలంటూ వారు గగ్గోలు పెట్టారు. తమ నివాసాలను కూల్చి వేయకూడదని, అక్కడి నివాసితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పర్మిషన్లు వచ్చాకే ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ వేడుకోలు

తమకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతనే ఇంటి నిర్మాణాలు చేపట్టామని ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులను, డబ్బున్న వాళ్ళని వదిలేసి పేదవాళ్లపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని వారు అసహనం వ్యక్తం చేశారు.

ఇళ్ళ కూల్చివేతలపై హైడ్రా చెప్తుందిదే.. సామాన్యులు కన్నీరు

మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇటు సామాన్యులకు సైతం షాక్ ఇస్తున్నాయి. అయితే హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నివాసాలు ఏర్పరచుకొని వాటిని కమర్షియల్ గా వినియోగిస్తున్న వాటిపైన చర్యలు తీసుకుంటున్నామని అలాగే కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు, నిర్మాణ దశలో ఉన్న వాటిపైనే చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం సామాన్య ప్రజల ఇళ్ళ కూల్చివేతలకు హైడ్రా పాల్పడుతోందని, తమకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

Image 1

ఉగాది కవి సమ్మేళనం కవితలు పంపండి

Posted On 2026-03-08 11:57:45

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-08 11:17:27

Readmore >
Image 1

ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

Posted On 2026-03-08 09:16:57

Readmore >
Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >