| Daily భారత్
Logo




మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్

News

Posted on 2024-09-03 12:16:01

Share: Share


మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్

రూ.52 లక్షలు దారిమళ్లించిన కాంట్రాక్టు ఉద్యోగి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల సంతకాలను పోర రీ చేసిన ఓ ఉద్యోగి ఏకంగా 52 లక్షల వర్సిటీ నిధులను దారి మళ్లించాడు. వర్సిటీ ఆడిట్ లో విషయం వెలుగుచూడగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అకౌంట్స్ సెక్షన్ లో పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ ఉర్దూ యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్ లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని భారీ కుట్రకు తెరలేపాడు. ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా 52లక్షల రూపాయల నిధులను తన ఖాతాకు మళ్లించాడు. ఇటీవల జరిపిన ఆడిట్ లో ఈ కుట్రను యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో జాకీర్ హుస్సేన్ ఈ కుట్రకు పాల్పడినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం నిధుల గోల్ మాల్ విషయమై రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన జాకీర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >
Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >