Posted on 2023-11-07 18:56:17
17వ పోలీస్ బెటాలియన్ ను సందర్శించిన డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ .
డైలీ భారత్, సిరిసిల్ల : ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ, టి.ఎస్.ఎస్.పి బెటాలియన్స్ గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చిన డీ.ఐ.జీ సిద్ధిఖీ బెటాలియన్ లో విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించారు. పరిపాలన ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మినిస్టీరియల్ స్టాఫ్ కు సంబంధించిన విభాగాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బెటాలియన్ కు సంబంధించిన యూనిట్ హాస్పిటల్,మోటార్ ట్రాన్స్పోర్ట్, బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీస్, క్వార్టర్ మాస్టర్ ఆఫీస్ వింగ్ ల యొక్క వివిధ రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గాడ్ రూమును ప్రారంభించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.నిర్మాణంలో ఉన్న పరిపాలన భవనాన్ని మరియు బెల్ ఆఫ్ ఆర్మ్స్ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ వార్షిక తనిఖిలో భాగంగా డి.ఐ.జి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని మరియు అధికారులు మరియు సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాష్ నారాయణ ,యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >