Posted on 2023-11-06 04:37:11
డైలీ భారత్, అస్సాం: అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసింది. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ను తయారుచేశాడు. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >