Posted on 2023-11-06 05:37:11
డైలీ భారత్, అస్సాం: అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసింది. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ను తయారుచేశాడు. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >