Posted on 2023-11-05 16:31:17
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీ ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాల్సిందే
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశం
ముఖ్య అతిథిగా పాల్గొన్న బోయినపల్లి వినోద్ కుమార్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తల్లిదండ్రులు కన్న బిడ్డలను జాగ్రత్తగా సాకినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని తన కన్న బిడ్డల వలే సాకుతున్నారని, ఆ రీతిలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలంటే... మూడవసారి కూడా బి.ఆర్.ఎస్ పార్టీనే గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ భోజన పల్లి వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం సిరిసిల్లలోని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి పక్కాగా అభివృద్ధి బాటలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.
పసి పిల్లలను సాకి పెద్ద జెసి నా విధంగానే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆ విధంగానే ముందుకు నడిపిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని వినోద్ కుమార్ అన్నారు.
ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ, కార్యదర్శి మంజుల, బీ ఆర్ ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >