Posted on 2023-11-05 15:31:17
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీ ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాల్సిందే
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశం
ముఖ్య అతిథిగా పాల్గొన్న బోయినపల్లి వినోద్ కుమార్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తల్లిదండ్రులు కన్న బిడ్డలను జాగ్రత్తగా సాకినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని తన కన్న బిడ్డల వలే సాకుతున్నారని, ఆ రీతిలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలంటే... మూడవసారి కూడా బి.ఆర్.ఎస్ పార్టీనే గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ భోజన పల్లి వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం సిరిసిల్లలోని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి పక్కాగా అభివృద్ధి బాటలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.
పసి పిల్లలను సాకి పెద్ద జెసి నా విధంగానే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆ విధంగానే ముందుకు నడిపిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని వినోద్ కుమార్ అన్నారు.
ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ, కార్యదర్శి మంజుల, బీ ఆర్ ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >