| Daily భారత్
Logo




వైద్యనిపుణుల హెచ్చరిక... వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం

News

Posted on 2023-11-06 14:48:27

Share: Share


 వైద్యనిపుణుల హెచ్చరిక... వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం

డైలీ భారత్, ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..

వాయు కాలుష్యం హానికరమైనదని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని అన్నారు. వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా తీవ్రమైన కేటగిరీలోనే వాయు నాణ్యత ఇండెక్స్ ఉంది..

Image 1

హనుమాన్ ర్యాలీ సందర్భంగా మజ్జిగ పంపిణీ

Posted On 2026-04-02 13:46:06

Readmore >
Image 1

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

Posted On 2026-04-02 13:44:47

Readmore >
Image 1

వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-04-02 13:39:34

Readmore >
Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

Posted On 2026-04-02 12:04:26

Readmore >
Image 1

రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ

Posted On 2026-04-02 11:35:51

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ

Posted On 2026-04-02 11:29:23

Readmore >
Image 1

నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

Posted On 2026-04-02 07:41:02

Readmore >
Image 1

జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్

Posted On 2026-04-02 07:30:03

Readmore >
Image 1

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

Posted On 2026-04-02 06:54:11

Readmore >
Image 1

జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం

Posted On 2026-04-02 06:52:45

Readmore >