Posted on 2024-08-07 18:01:16
ఏబీవీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మానవ సేవయే మాధవ సేవ అని అన్ని విధాలుగా నిజాయితీగా సేవా అందించిన నాడే సమాజంలో ఆరోగ్యం సిద్ధిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలంలోని హాజీపల్లి గ్రామంలో ఏబీవీ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కష్టకాలంలో హాస్పిటల్ కి వచ్చే పేదలకు భరోసా ఇచ్చి మానవతా దృక్పథంతో వైద్యం చేయాలని సూచించారు. ఓపికతో సేవ చేస్తే వైద్య రంగంలో మంచి స్థానానికి ఎదగవచ్చని పేర్కొన్నారు. డబ్బు లాభాపేక్షతో సేవలు చేయవద్దని పేదలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే బాగుంటుందని అన్నారు. రోగిని మంచి మాటలతో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు. విశ్వాసమే వైద్యానికి బలం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ కుమార్, భార్గవి దంపతులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సేవలో భాగంగా ఏబీవీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలను ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్, ఎంపీటీసీల సంఘం నాయకులు శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్, నర్సప్ప మాజీ సర్పంచ్ కృష్ణ, కమ్మదనం నవీన్, విష్ణు హాస్పిటల్ యజమాన్యం, మరియు సిబ్బంది పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >