| Daily భారత్
Logo




మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత

News

Posted on 2024-08-07 13:58:33

Share: Share


మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత

మున్సిపల్ కమీషనర్ వెంకన్న, సిడీపిఓ నాగమణి, ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మనుషుల అక్రమ రవాణా నిర్ములనతో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చని షాద్ నగర్ మున్సిపల్ కమీషనర్ వెంకన్న సీడీపీఓ నాగమణి ప్రజ్వల స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్  బలరామ కృష్ణ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ షాద్ నగర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కి నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ  కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ షాద్ నగర్ నందు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కమీషనర్ వెంకన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది  ప్రపంచం లోనే అతిపెద్ద నేరం అని, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు, ముక్యంగా పేద మధ్య తరగతి వారు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మోసాలకు గురి అవుతున్నారు, ప్రతి ఒక్కరు దీనిపై అవగాహనా పెంచుకొని అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని మహిళలకు, అమ్మాయిలకు అక్రమ రవాణా పై అవగాహనా కల్పించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇది మానవతా దృక్పతం తో చేయాలనీ, దీని వలన చాలా మంది అమ్మాయిలు రక్షింప బడతారు అని అన్నారు. సీడీపీఓ నాగమణి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పై నిర్వహిస్తున్న ఈ శిక్షణను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను నిర్ములించే ఉదేశ్యం తో ఇస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, గ్రామాలలో అన్ని వర్గాల వారికి అవగాహనా కల్పిస్తూ అప్రమతం చేయాలనీ, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేయాలనీ అన్నారు. 

ప్రజ్వల స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిర్ములన కొరకు ప్రజ్వల సంస్థ గత 28 సంవత్సరాలనుండి లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తు 28,600 మంది అమ్మాయిలను కాపాడి పునరావాసం కల్పించడం జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ గారు సంబంధిత ఐసీడీఎస్, పోలీస్, జ్యుడీషియల్, ఎడ్యుకేషన్, డీఆర్ డీఏ డిపార్ట్మెంట్ల సహకారంతో పని చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లలోని అంగన్వాడీ టీచర్ లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలను నిరహించేలా చేస్తూ ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను ఎలా సంప్రదించలో ఈ శిక్షణలో నేర్చుకోవడం జరుగుతుంది 

శిక్షణ తో భాగంగా మానవ అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, ఎవరు దీనికి గురి అవుతారు, లైంగిక వ్యాపారం లోకి వెళ్లిన అమ్మాయిల పరిస్థితులు ఎలావుంటాయి మరియు సైబర్ ట్రాఫికింగ్ (ఆన్లైన్ మోసాలు) వివరిస్తూ ప్రతి గ్రామంలో సమాజ జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి,వారి ద్వారా అక్రమ రవాణా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని మరియు ప్రతి ఒక్కరు ఈ విషయాలపట్ల అప్రమతంగా ఉండాలని అన్నారు.


ఈ శిక్షణ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ నయీమ్ పాషా, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు అండాలు, సంధ్య, విజయ మరియు ప్రజ్వల ప్రతినిధులు సురేష్ కుమార్, అనిల్ కుమార్, మితాళి రాజ్ మరియు మండలం లోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు...

Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >
Image 1

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-14 11:10:04

Readmore >
Image 1

వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

Posted On 2026-03-14 08:10:42

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >