Posted on 2024-08-06 18:48:44
దోచుకుని... దాచుకున్నారు..!
దాష్టికాలు చేసి సత్య హరిశ్చంద్రుల్లా పలుకులా..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణా ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల కాలంలో గత పాలకులు తెలంగాణా రాష్ర్ట ప్రజలను అష్ట కష్టాలపాలు చేసి వారిని అడ్డంగా దోచుకుని దాచుకున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనక పోయిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం సాగిస్తానని ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని గుర్తు చేశారు. ఇలాంటి ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాదించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిన వారంతా నేడు సత్య హరిచంద్రుల్లా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. నిజమైన ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే విదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అదే దారిలో ముందుకు సాగుతున్నమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, బాదేపల్లి సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు కొంకళ్ళ చెన్నయ్య, పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, ఐఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి రఘు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జెఎసి నాయకులు కరుణాకర్ , టి.ఎల్.ఎఫ్, వి రామారావు, ఈ.పాండు, మందారం నరసింహులు , కర్ణ కోల రవీంద్రనాథ్, జి.రాము, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి, శివ నాగయ్య, స్వరాజ్ బాబు, అబ్దుల్ గపూర్, సత్యనారాయణ గౌడ్ , అనిల్ కుమార్, బుచ్చయ్య, నాగరాజు , విజయ్ తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >