Posted on 2024-07-16 11:02:36
షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి షాద్ నగర్ పట్టణ సీఐ విజయకుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదేవిధంగా షాద నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను డిపార్ట్మెంట్ తరఫున అవసరమైన చోట వాడుకోవడానికి సిద్ధంగా ఉంటే మా వాలంటీర్లు వస్తారని చెప్పడం జరిగింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు డ్రగ్స్ వ్యతిరేక డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల లాంటి కొన్ని రకాల సేవల్లోకి తీసుకొని సమాజంలో భాగస్వామ్యం చేద్దామని పిలుపునిచ్చిన నేపథ్యంలో స్పై కెమెరాల పైన టెక్నికల్ గా ట్రైనింగ్ ఇవ్వాలని ట్రాఫిక్ విధుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలని వారికి సమాజంలో భాగస్వామ్యం చేయాలని కోరడం జరిగింది మరియు ఇంతకుముందు లాగానే షాద్నగర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి అవేర్నెస్ ప్రోగ్రాం లు కళాశాలలో యధావిధిగా జరుగుతూనే ఈ ప్రత్యేకమైనటువంటి సేవలను ఉపయోగించుకునే విధంగా విద్యార్థులకు సమాజంలో భాగస్వాములను చేయాలని కోరడం జరిగింది. దీనికి సీ ఐ విజయ్ కుమార్ స్పందిస్తూ మా యధావిధి కళాశాల ప్రోగ్రాంలతోపాటు స్పై కెమెరా టెక్నికల్ ట్రైనింగ్ పైన, ట్రాఫిక్ లో డ్యూటీలపైన తర్ఫీదును ఇచ్చితప్పకుండా మీ సేవలను వాడుకుంటామని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు షాద్నగర్లో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు చేసినందుకు, ఎలక్షన్ డ్యూటీలో సహాయకులుగా పాల్గొన్నందుకు, ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేసినందుకు పట్టణ సీఐ విజయకుమార్ గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ను అభినందించారు. ఇందులో పట్టణ షాద్నగర్ ఎస్సై సుశీల కూడా పాల్గొనడం జరిగింది.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >