Posted on 2024-07-14 14:19:46
నాదర్ గుల్ ప్రజాప్రతినిధులు సేవలను మరవలేం
జడ్పీయెచ్ఎస్ స్కూల్ లో ఉచిత వైద్య శిబిరంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రవీణ్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇల్లు, ఊరు, సమాజం బాగుంటుందని బ్రైట్ హాస్పిటల్ ఎండీ ప్రవీణ్ అన్నారు. ఆదివారం నాదర్ గుల్ ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేనా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ... పేదలకు ఉచితంగా వైద్యం, మందులు అందించాలని బ్రైట్ హాస్పిటల్ సేవలు అభినందనీయమన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను బడంగ్ పేట కార్పొరేషన్ సహా మహేశ్వరం నియోజకవర్గం మొత్తం విస్తరిస్తామని ఆదర్శ ఫౌండేషన్ ఛైర్పర్సన్, విలేజ్ లైబ్రరీ వ్యవస్థాపకులు జి. అనితారెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా సహారించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు హాస్పిటల్ యాజమాన్యం. ఉచిత వైద్య సేవలుతో పాటు అన్ని పరీక్షలపై 50% రాయితీలు ఇచ్చిన ఆసుపత్రికి కృతజ్ఞతలు తెలిపారు నాదర్ గుల్ ప్రజలు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >