| Daily భారత్
Logo




బతుకమ్మ చీరలతో బతికిందేవరు : జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

News

Posted on 2023-10-28 16:57:20

Share: Share


బతుకమ్మ చీరలతో బతికిందేవరు : జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

కేటీఆర్ పద్మశాలిలకు చేసిందేమీ లేదు

ఉన్న సాంచాలు అమ్ముకున్నమని ఎద్దేవా

పద్మశాలీలనే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని హెచ్చరిక,

జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

డైలీ భారత్, సిరిసిల్ల: బతుకమ్మ చీరల తయారితో సిరిసిల్ల పద్మశాలి బతకటం లేదని, మంత్రి కేటీఆర్ పద్మశాలి సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆసాములతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో సాంచాలపై కాటన్, పాలిస్టర్ వస్త్రాలు నడిచినప్పుడు కొత్త సాంచాలు తెచ్చుకొని ఉపాధి పొందే వాళ్ళమని, బతుకమ్మ చీరలలో పదిమంది ఆసాములు మాత్రమే బాగుపడ్డరన్నారు. ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వందల మంది ఆసాములు ఉన్న సాంచాలను పగులగొట్టి అమ్ముకొని రోడ్డుమీద పడ్డారన్నారు. యారాన్ డిపో తెస్తానని ఇంతవరకు తీసుకురాకపోవడంతో మధ్య దళారులు ఎక్కువయ్యారన్నారు. బ్యాంకుల్లో లోన్ ఇస్తామని ఇప్పించలేదని, కాటన్ పరిశ్రమలో డైయింగులు, సైజింగులు పూర్తిగా ముతబడ్డాయని, కాటన్ నడుపుకుందమన్న అదికూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పద్మశాలీల బతుకులు మార్చామని చెప్పుకుంటున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పద్మశాలీలకు చేసిందేమీ లేదన్నారు. బతుకమ్మ చీరలతో సంవత్సరం పాటు ఉపాధి కల్పిస్తానన్న కేటీఆర్, కేవలం మూడు నెలల ఉపాధి కల్పిస్తూ కార్మికులను, ఆసాములను రోడ్డున పడేశారన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో మెరుపు పర్యటనలు చేస్తున్నారని, కనీసం పద్మశాలీలను కలిసి పద్మశాలీల సమస్యలు విన్న పాపాన పోలేదన్నారు. స్పిన్నింగ్ మిల్ వల్ల నేతన్నలకు ఉపాధి దొరికేదని, దానిని కూడా ప్రభుత్వం అమ్ముకుందన్నారు. సిరిసిల్లలో పద్మశాలిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే పద్మశాలీలకు, బీసీలకు న్యాయం జరుగుతుందని, పార్టీలు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్టు ఇవ్వాలని, లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆసాములు కస్తూరి రవీందర్, వల్లకట్ల భూమేష్, గోనె పరశురాములు, సబ్బని బాలయ్య, బోలి వీరేశం, వీరస్వామి, రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >