Posted on 2024-07-08 16:58:26
ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. .బి.బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన చరణ్ తన తల్లితండ్రి మరణించినారని నా తల్లి తండ్రులు ఒక ఎకరం పది గుంటలు భూమి కొని పట్టా చేసుకోలేదని నా తల్లి తండ్రులు మరణించినారని ప్రస్తుతము మేము కాస్తులోనే ఉన్నామని అయినప్పటికి మాకు అట్టి పొలం అమ్మిన వారు ఈ పొలం మాదే అని దౌర్జన్యం చేస్తున్నారని కావున వారి పై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ రూరల్ సి.ఐ కి సూచనలు చేయటం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన హన్మంత రెడ్డి కి పెద్ద శంకరంపేట మండలం తిరుమాలపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 261/ఉనందు 0-1250 గుంటల భూమిని తమ తాతల ద్వారా వంశపారంపర్యంగా వచ్చిందని ఈ భూమిలో మా పూర్వీకుల నుండి ప్రస్తుతం వరకు మేమే కబ్జాలో ఉన్నామని ఇట్టి భూమిని పెద్ద శంకరంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేసి అట్టి భూమిలో బేస్మెంట్ వరకు నిర్మాణాన్ని చేపట్టినారని కావున వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సి.ఐ కి సూచనలు చేయటం జరిగింది.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >