Posted on 2024-07-08 13:09:46
మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైలట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
కారులో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.యాక్సిడెంట్ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు.
మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్ గా గుర్తిం చారు. నేరెడ్ మీట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు.
యాదగిరిగుట్టకు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పిఇవ్వాళ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >