Posted on 2023-10-22 11:48:14
డైలీ భారత్, హైదరాబాద్:కేసీఆర్ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్బుతమని గొప్పలు చెప్పారని, బస్సులు పెట్టి రైతులను, నేతలను తీసుకెళ్లి కాళేశ్వరం చూపించారని అన్నారు.
పంపు హౌసులు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను చూడనివ్వలేదని, ఇప్పుడు ఎలాంటి వరదలు లేకుండానే ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని, ఇది కేసీఆర్ అవినీతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి విమర్శించారు..
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎన్నోసార్లు చెప్పారని, కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతూనే ఉన్నామని, ఇప్పటికైనా దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నామన్నారు.
కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని, ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపించాలన్నారు. సిట్టింగ్ జడ్జితో ప్రాజెక్టు పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు...
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >