Posted on 2023-10-23 21:10:32
డైలీ భారత్, సిరిసిల్ల: మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు. ఆయుధ పూజ అంటే ఎవరి వృత్తికి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసుర మర్ధినిగా రాక్షసులను సంహరిస్తుంది. కాబట్టి ఆరోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి మన ఇళ్లలో, మన వృత్తి పరంగా ఉండేటటువంటి సాధనాలను పూజ చేయటం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు. మనం పూజించవలసిన పనిముట్లు లేదా ఆయుధాలను శుభ్రం చేసి వాటికి పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి వాటిని వరుస క్రమంలో పెడతారు. అలా పెట్టిన సాధనాలకు గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయతో దిష్టి తీసి దానిని పగల కొడతారు. ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు, ఈ విధంగా ప్రతి రంగంలో పనిచేసేటటువంటి అన్నిరకాల యంత్రాలకి కూడా దశమి కి ముందు రోజు ఈ ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఇలా చేయడం ద్వారా మనకి కూడా విజయం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >