Posted on 2024-05-27 20:49:22
వారంలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తాం
188 కొనుగోలు కేంద్రాల ధాన్యం పూర్తి
మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
డెల్లీ భారత్, మెదక్: తడిచిన ధాన్యాన్ని లోకల్ మిల్స్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పిస్తాం
కొనుగోలు కేంద్రాల నుండి ఎగుమతి చేసే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించాలి
20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సిద్దిపేట, గద్వాల్ మిల్లులకు పంపించడం జరిగింది.
రైతులు ఎవరు అధైర్య పడవద్దు అండగా ఉంటాం
క్షేత్రస్థాయిలో మెదక్ జిల్లా రామాయంపేట మండలం లోని రాయలపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత రామాయంపేట తాహాసిల్దార్ రజినీ , కొనుగోలు నిర్వాహకులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉందన్నారు. ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2 48 374. 280 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 57 ,367 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి 421,74 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. 188 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని వివరించారు.ధాన్యం కొనుగోలు నిర్వహకులు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >