Posted on 2024-05-26 17:30:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ ఉన్నత పాఠశాలలో 1987–88 విద్యా సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థులు తమకు విద్యనందించిన
గురువుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ
సమ్మేళనం ఆదివారం షాబాద్ లోని అన్మూల్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, గురువులకు నమస్కారం చేస్తూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
ఆనందంగా గడిపారు. గురువులు మాట్లాడుతూ మేము విద్యాబుద్ధులు నేర్పించిన వారు మంచి స్థాయిలో ఉన్నందుకు గర్వంగా ఉంది అని, మీరంతా సమాజ
నిర్మాణానంలో భాగస్వాములు కావాలని, ఆత్మీయ
సమ్మేళనం మధుర స్మృతులకు వేదిక అని
మాట్లాడారు, తదనంతరం విద్యార్థులు గురువులను
సన్మానించి మెమెంటోను జ్ఞాపిక అందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతు మనకు తెలిసిన వ్యక్తే కొద్ది రోజుల తర్వాత కనిపిస్తేనే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడుతాం.. అదే 10 సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారు వెళ్లి మళ్లీ 37 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒక్క చోట కలిస్తే ఇక ఆ ఆనందానికి అవధులుండవు అని అన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >