Posted on 2026-04-17 08:15:29
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రియుడికి పుట్టినరోజు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఖరీదైన వాచీలను దొంగిలించిన యువతి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి కారులో జూబ్లీహిల్స్లోని ప్రముఖ వాచ్ షోరూమ్కు వెళ్లింది. ప్రియుడిని కారులోనే కూర్చోబెట్టి, ఆమె కస్టమర్లా నటిస్తూ షోరూమ్లోకి ప్రవేశించింది.అక్కడ సేల్స్మెన్ను మాటల్లో పెట్టి, సుమారు రూ.2 లక్షల విలువైన రెండు ఖరీదైన తీస్సోట్ వాచీలను చాకచక్యంగా తన హ్యాండ్బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి పరారైంది. వాచీలు కనిపించకపోవడంతో షోరూమ్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, యువతి వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఆమెను ఖమ్మంలో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >