Posted on 2026-07-25 15:37:20
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రతి ప్రభుత్వ పనులపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రద్ధ వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్ ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.60 కోట్లతో ప్రారంభమైన పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రతి డివిజన్ కు కోటి రూపాయలు కేటాయించారని త్వరలోనే అన్ని డివిజన్లో పనులు ప్రారంభమవుయని తెలిపారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే నూతన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ప్రధానగా నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రూ.30 కోట్లతో రోడ్డు ప్రతిపాదించామన్నారు. అలాగే ఆర్ యూబీ ల నిర్మాణానికి రూ.60 కోట్లు, నాందేవ్ వాడ వంతెన పొడిగింపునకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అమృత్ 2 కింద మంజూరైన యూజీడీ పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, డీఈ యోగేందర్, ఏఈ శంకర్, యూ జీ డీ ప్రాజెక్ట్ మేనేజర్ జయశంకర్, ఆర్ అండ్ బి అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >