Posted on 2026-07-25 16:42:32
సిరిసిల్లలో "Gift A Smile" కార్యక్రమం.
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బి.వై.నగర్ 34వ వార్డుకు చెందిన కుడిక్యాల సతీష్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల కారణంగా వారి కుమార్తె ఉన్నత చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, "Gift A Smile" కార్యక్రమం ద్వారా కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్తె మాట్లాడుతూ.. తనకు ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, తండ్రి అనారోగ్యం మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సిరిసిల్లలోనే డిగ్రీ చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, ఆమెకు ధైర్యం చెబుతూ విద్యకు సంబంధించిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, పంతం శ్రీనివాస్, కోమాకుల ఆంజనేయులు, గుర్రాల నర్సింలు, గజ్జెల్లి సత్యనారాయణ, ఆడెపు రవి, శ్రీపతి సురేష్, సింగం శరత్ తదితరులు పాల్గొన్నారు.
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >