| Daily భారత్
Logo




మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2026-04-17 08:16:17

Share: Share


మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలందరూ అక్షరాస్యూలు గా అభివృద్ధి చెందాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం షాబాద్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో నోడల్ ఆఫీసర్ రామ్ రెడ్డి, ఎంఆర్ఓ అన్వర్, ఎంపిడిఓ అపర్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర గీతం తో

మండల సభను ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.మండల సభ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్ లను వారు సందర్శించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇప్పటికి తెలంగాణలోని 558 మండలాలలో మహిళలను బస్సులకు యజమానులను చేసినట్లు వెల్లడించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్న, కాంట్రాక్టు పద్ధతిలో బస్సులు తీసుకోవాలన్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలను మహిళలకు అప్పగించి ఉపాధి దిశగా వారిని ముందడుగు వేయించడమే కాకుండా బస్సుల కొరత కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. కేవలం బస్సులు మాత్రమే కాకుండా సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను కూడా మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల భవనాలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మాణం తలపెట్టిందని. ఇందులో భాగంగా మూడు నెలల్లో 8000 భవనాలను నిర్మించేందుకు శ్రీకారం జరిగిందని అన్నారు. పలు గ్రామాలలో గ్రామపంచాయతీ ద్వారా మహిళా సంఘానికి స్థలాన్ని మహిళలు తమ హక్కుగా తీసుకున్నరని, మహిళలలో అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పని చేయాలని అన్నారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలని ఆ దిశగా అందరూ పని చేయాలని అన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణ పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మి,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు, వార్డు సభ్యులు,అధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >