Posted on 2026-04-17 08:35:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న 40 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసి, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని, చార్జ్షీట్లు ఆలస్యం లేకుండా దాఖలు చేయాలని అధికారులకు సూచించారు.
బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు ప్రభుత్వ పరిహారం, పునరావాస సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేస్తూ, శాఖల మధ్య సమన్వయం పెంచి కేసుల పరిష్కారంలో వేగం తీసుకురావాలని తెలిపారు.
బాధితుల గోప్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కులపై చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మాట్లాడుతూ ప్రతి కేసును సున్నితంగా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ రాంబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #SCSTWelfare #SocialJustice #AtrocityCases #LawAndOrder #Telangana
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >