Posted on 2026-04-17 07:41:26
రూ.10 లక్షల బిల్లు పాస్ చేసేందుకు రూ.30 వేల డిమాండ్
డైలీ భారత్, నల్గొండ జిల్లా: విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు #ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
కంబాలపల్లి సబ్స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ వ్యక్తి పునరుద్ధరించాడు.
ఇందుకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు సదరు ఏడీఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఏప్రిల్ 16న తన కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా సైదులును రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >