Posted on 2024-05-26 11:43:27
డైలీ భారత్, భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి.
స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇక, నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని కొంతమంది, మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.
వేప చెట్టు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలదని.. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి నివాసం తర్వాత ఈ బంగ్లాను ప్రహ్లాద్ పటేల్ పొందారు. B-7 బంగ్లా భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్లో ఉంది. ఆయన బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు నాటారు. అందులో ఒక వేప చెట్టు కూడా ఉంది. వాస్తవానికి, ఈ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిని పరిశీలించడానికి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం ఇక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో, మామిడి పండ్లు వేలాడుతున్న వేప చెట్టుపై అతని కళ్ళు పడ్డాయి. నిజానికి, వేప చెట్టుపై మామిడి కొమ్మ కూడా ఉంది.. ఇది చూసి అతను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఈ వేప చెట్టుకు పరిశీలించిన వృక్షశాస్త్రజ్ఞుడు ప్రతిభా సింగ్ మాట్లాడుతూ.. ఈ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉంది.. చాలా సార్లు, మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు.. మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >