డైలీ భారత్, కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న జ్ఞానశ్రీ చివరకు హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది.
గదిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది