Posted on 2024-04-15 20:33:49
డైలీ భారత్, కర్నూల్: శ్రీమద్రామాయణం శ్రీరాముని అద్భుతమైన గాథను ఆయన రాజ్యాన్ని పాలనా వ్యవస్థను క్షుణ్ణంగా ఉదహరించారు. నేటి తరం పాలకులు రామచంద్ర ప్రభువును ఆదర్శంగా తీసుకుని ప్రజలను పాలించాలి అని చిత్రకారుడు, కథా వాచకుడు హరిబేల్ ఉదయ్ కుమార్ శ్రీచక్ర అన్నారు. బలహీనులను ప్రభువులు ఎలా ఆదరించాలి, ఆదర్శ పాలన అంటే అది రామరాజ్యమే నాని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, రాంబొట్ల దేవస్థానం నందు ఏర్పాటు చేసిన శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు వారు "శ్రీ రామ రాజ్యం" అనే అంశంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్, ఆలయ కమిటీ ఛైర్పర్సన్ నగరూరు దీప్తి, కార్పోరేటర్లు నగరూరు శ్రీనివాసులు, శేషుయాదవ్ , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, జెట్టి యాదవ్, అర్చకులు గిరిశ్ శర్మ, మహాలక్ష్మీ , కృష్ణ కాంత్, ఆలయ సిబ్బంది పెద్ది శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీవారి సేవకులు మల్లేశ్, మహాలక్ష్మీ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసకుడిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు. పాల్గొన్న భక్తులందరికీ తరిగొండ వెంగమాంబ సేవా సమితి ఆధ్వర్యంలో వడపప్పు పానకం భక్తులకు అందించారు.
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >