Posted on 2026-03-04 16:19:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెన్నెడీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు కలిసి ఆనందంగా పాల్గొన్నారు. పాటలు, డాన్సులతో విద్యార్థులు కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటాలని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ డేనియల్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతూ, పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించేలా కట్టుదిట్టంగా సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు విశాలమైన వాతావరణంలో ఇలాంటి అంగుహార్ బాటలు లేకుండా ప్రకృతి లో నిర్వహించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >