| Daily భారత్
Logo




మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం :రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

News

Posted on 2023-10-08 20:42:41

Share: Share


మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం :రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: సిఎం కేసిఆర్ నాయకత్వంలోనీ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మైనార్టీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకం కింద 120 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఒక కోటి 20 లక్షల రూపాయలను అందజేశారు. అలాగే పేద మైనార్టీ మహిళలకు 425 మందికి ఒక్కొక్కరికి పదివేల విలువగల 425 కుట్టుమిషన్లను రాష్ట్ర ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక సిఎం కేసిఆర్ మైనార్టీల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు స్థాపించారనీ చెప్పారు. నియోజకవర్గానికి ఒక్క మైనారిటీ గురుకులం పెట్టారన్నారు. మైనార్టీ బాలబాలికలకు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకులాల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఇందు కోసం ఏటా ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం ఒక లక్షా 20 వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. అన్ని సదుపాయాలతో కూడిన మైనార్టీ గురుకులాల్లో చదివే బాల బాలికలకు మంచి విద్యా బోధన ఉందన్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ,బిసి గురుకులాలలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మైనార్టీ గురుకులాలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఫలితంగా కొన్ని మైనారిటీ గురుకులాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను గురుకులాల్లో చేర్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మైనార్టీ గురుకులాలు అన్ని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,

టేస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య,

రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ మానస, మైనార్టీ శాఖ ఓసిడి సర్వర్ మియా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >
Image 1

హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది

Posted On 2026-03-12 21:53:55

Readmore >
Image 1

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

Posted On 2026-03-12 21:52:35

Readmore >
Image 1

వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Posted On 2026-03-12 19:38:16

Readmore >
Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >
Image 1

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

Posted On 2026-03-12 18:45:43

Readmore >
Image 1

79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర

Posted On 2026-03-12 18:43:20

Readmore >
Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >