Posted on 2026-08-17 14:30:12
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాధితుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఈ కార్యక్రమానికి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 21 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను క్షుణ్ణంగా విన్న అనంతరం, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఫోన్ చేసి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. వినతులు స్వీకరించి అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చే అన్ని ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ విధంగా ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >
ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
Posted On 2026-08-17 14:30:12
Readmore >
పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..
Posted On 2026-08-17 14:29:19
Readmore >
రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-17 14:28:19
Readmore >
కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం
Posted On 2026-08-17 14:27:28
Readmore >
ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Posted On 2026-08-17 13:45:49
Readmore >
గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-08-17 13:42:50
Readmore >