| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు

News

Posted on 2026-08-17 14:28:19

Share: Share


రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు

డైలీ భారత్, వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులను "తాడు ఆట" పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వేములవాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

వేములవాడ టౌన్ ఎస్.ఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లాకు చెందిన రాయపురం సురేందర్, 42, ఆటో డ్రైవర్, ఐనవోలు మండలం మరియు పల్లకొండ దేవేందర్, 33, మిల్లర్ ఆపరేటర్, ఆత్మకూరు మండలం అనే ఇద్దరూ కలిసి వేములవాడ ఆలయ పరిసరాల్లో తాడు ఆట నిర్వహిస్తూ అమాయక భక్తుల వద్ద డబ్బు దండుకుంటున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి, ఆట నిర్వహిస్తున్న సమయంలో దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి తాడు ఆట సామగ్రి, అప్సర పెన్సిళ్లు మరియు నగదు రూ. 2,000 లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్.ఐ వెల్లడించారు.

ఆలయానికి వచ్చే భక్తులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని, జూదం లాంటి అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Rajanna Sircilla News, Vemulawada News, Taadu Aata, Telangana Crime News

Image 1

రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Posted On 2026-08-17 15:17:48

Readmore >
Image 1

అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్

Posted On 2026-08-17 15:01:32

Readmore >
Image 1

పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం

Posted On 2026-08-17 14:52:49

Readmore >
Image 1

ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు

Posted On 2026-08-17 14:30:12

Readmore >
Image 1

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..

Posted On 2026-08-17 14:29:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-17 14:28:19

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం

Posted On 2026-08-17 14:27:28

Readmore >
Image 1

ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

Posted On 2026-08-17 13:45:49

Readmore >
Image 1

గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-08-17 13:42:50

Readmore >
Image 1

బీహార్ : ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట... ఏడుగురు భక్తులు మృతి

Posted On 2026-08-17 13:41:04

Readmore >