Posted on 2026-07-17 14:04:31
డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లాలో చిన్నారుల పోషణ, అంగన్వాడీ సేవలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి సారించారు.
శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిల్వ ఉన్న కోడిగుడ్లు, బాలామృతం, పిల్లలకు సిద్ధం చేసిన ఆహారం, రోజూ హాజరయ్యే పిల్లల సంఖ్యను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతంతో సహా పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు.
చిన్నారులు ప్రతిరోజూ అంగన్వాడీకి వచ్చేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, ఆటపాటల ద్వారా పిల్లలకు బోధన అందించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలను పూర్తిగా వినియోగించుకుని, ఇచ్చే పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని ఆమె కోరారు.
పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
#RajannaSircilla #GarimaAgarwal #Anganwadi #Telangana #Collector
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >