Posted on 2026-07-17 14:10:00
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆహారం తీసుకున్న అనంతరం పలువురు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్న వారిని వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆసుపత్రిని సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బందికి ఆదేశాలు...
బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అవసరమైన మందులు, IV ఫ్లూయిడ్స్తో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిబ్బందికి సూచించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద ఆహారాన్ని తినవద్దని, ఆహారం తర్వాత అస్వస్థత వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
ఈ పరామర్శలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
#Siricilla #FoodPoisoning #DMHO #TelanganaNews #Health
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >