| Daily భారత్
Logo




నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

News

Posted on 2026-07-17 13:51:23

Share: Share


నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

మాదిగ హక్కుల దండోరా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామంలో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న స్వప్న అనే దళితురాలిని కులం కారణంగా సర్పంచ్  హెడ్మాస్టర్ కూడా పలుకొని విధుల నుండి తొలగించడానికి మాదిగ హక్కుల దండోరా నిజాంబాద్ జిల్లా కమిటీ తరపున ఖండిస్తున్నామని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్పంగి దుర్గారాజ్ మాదిగ జిల్లా అధ్యక్షులు గాదెపగా గోపి మాదిగ  ఉమ్మడి నిజామాబాదు మహిళా ఇంచార్జి ఆదరి సరిత మాదిగ  తెలియచేశారు. శుక్రవారం నగరంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ అండ్ బి  గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నేటి రోజుల్లో  కూడా ఇంకా కుల వివక్ష చూపడం సరైన పద్దతి కాదని తెలియజేస్తున్నాం ఇందుకు కారణమైన హెడ్మాస్టర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో దళితుల మీద దాడులు అధికమవుతున్నాయని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని కోరారు. గత కొద్దీ రోజుల క్రితం పెద్దపెల్లి జిల్లాలో దళితులను గుడిలోకి రానివ్వలేదని అలాగే కొత్తపెళ్లి చేవెళ్లలో కూడా ఇలాంటి సంఘటన జరిగాయని దళితుల పట్ల వివక్షత మరింత అధికమవుతుందని ఈ సంఘటన రుజువు చేస్తున్నాయని తెలియజేశారు. దళితులను చిన్నచూపులు చూసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా మాదిగ హక్కుల దండోరా నిలబడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాంపల్లి గంగాధర్ మాదిగ గారు రావర్తి రవికుమార్ మాదిగ, బీసీ సంఘం నాయకులు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >
Image 1

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నీ కలిసిన సర్పంచ్

Posted On 2026-07-17 13:48:52

Readmore >
Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >