Posted on 2026-06-15 06:56:34
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల కోసం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన కల్లం రాధిక, రాజారెడ్డి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
దాతలు సమర్పించిన విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించారు. అనంతరం దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు.
ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు అందించే విరాళాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
#Vemulawada #RajarajeshwaraSwamy #TempleDonation #RajannaTemple
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >