| Daily భారత్
Logo




నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

News

Posted on 2026-06-15 14:00:59

Share: Share


నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు పనులు వేగవంతం 

గుట్టపైకి చేరుకున్న విడిభాగాలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన నాంపల్లి గుట్ట త్వరలోనే  పర్యాటక ఆకర్షణగా మారనుంది. గుట్టపై భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని ఏర్పాటు చేయడానికి చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానం విడిభాగాలను ప్రత్యేక వాహనాల ద్వారా గుట్టపైకి సోమవారం తరలించారు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో నాంపల్లిగుట్టపై ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ప్రతిష్ఠించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విమానం ప్రధాన విడిభాగాలు గుట్టపైకి చేరుకోగా, వాటి ఏర్పాటు  పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విమానం ఏర్పాటు పూర్తయిన తర్వాత నాంపల్లి గుట్టకు వచ్చే సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన నాంపల్లి గుట్టకు ఈ విమానం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విమానం ఏర్పాటు పూర్తయిన అనంతరం ఈ ప్రాంతం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న ఈ పనులు త్వరలో పూర్తికానుండగా, నాంపల్లి గుట్ట పర్యాటక శోభను సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >