Posted on 2026-06-13 11:36:13
కార్మికులకు అన్యాయం చేసే ఉద్దేశం మార్చుకోవాలి అని అంటున్న మాస్ లైన్
డైలీ భారత్, అశ్వరావుపేట: పంచాయతీ వ్యవస్థ ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పండూరి వీరబాబు హెచ్చరిస్తున్నారు.
అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దమ్మపేట రోడ్డు ఇరువైపులా పొట్టకూటికోసం డ్రైనేజీ మీద షాపులు పెట్టుకొని బ్రతికే కార్మికుల మీద పంచాయతీ కన్ను వేసి తక్షణమే ఖాళీ చేయాలని ప్రతి ఒక్క షాపుకు నోటీసులు పంపించారు. అంటే కార్మికులను వారి కుటుంబాలను రోడ్డు మీద పడేవేయాలని నిర్ణయించుకుందా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్లాట్ఫారం మీద బ్రతికే వారిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు పరిస్థితి ఏంటి? వారి జీవనోపాధి ఏంటి అని అన్నారు కార్మికుల మీద కాదు మీ ప్రతాపం బడా బాబులు రోడ్డు పక్కల స్థలాలు ఆక్రమించుకున్న దొంగ పట్టాలు పుట్టించి వారి సొంత స్థలాలు లాగా చలామణి అవుతున్న వారి మీద చూపించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న సంతపాకల స్థలంలో షెడ్యూల్ నిర్మించి ప్లాట్ఫారం మీద బ్రతికే వారికి ఆసరా కల్పించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఎన్నో అవుతవుకలు ఉన్నాయి ఇల్లు లేని వారి కంటే ముందుగా ఇల్లు ఉన్న వారికే రెండు మూడు ఇల్లు ఇవ్వడం వడ్డీ వ్యాపారస్తులకు పార్టీ కొమ్ము కాసే వారికి తప్ప, ఇల్లు లేని వారికి మొండిచేయి చూపించారు ఇది ఒక ఎత్తు అయితే చనిపోయిన వారికి ఇల్లు కేటాయించడం ఇది మరీ విడ్డూరమన్నారు. మంత్రి శీనన్న మీరు చెప్పిన మాటలకు చేసే పనికి ఒక్కటి కూడా పొంతన లేవు గత ఆయాంలో ఇల్లు ఉన్న వారికి సర్వే చేసి అట్టి వారికి ఇల్లు ఇవ్వబొమన్నారు. అన్నా మరి మీ అనుచరులు దమ్ము పేటలో ఇల్లు లేని వారికి న్యాయం చేయకుండా వారికి వారే దోచుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయమని మండిపడ్డారు. ఇక్కడ డ్రైనేజీల మీద బ్రతికే వారిని ప్రత్యామ్యాయం చూపించాక అప్పుడు తొలగించమని అట్టి విధంగా కాకుండా వారిని వెంటనే తొలగిస్తే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >