| Daily భారత్
Logo




ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

News

Posted on 2026-06-13 08:06:13

Share: Share


ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల  పై పంచాయతీ కన్ను

కార్మికులకు అన్యాయం చేసే ఉద్దేశం మార్చుకోవాలి అని అంటున్న మాస్ లైన్

డైలీ భారత్, అశ్వరావుపేట: పంచాయతీ వ్యవస్థ ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్   రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  పండూరి వీరబాబు హెచ్చరిస్తున్నారు.

 అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దమ్మపేట రోడ్డు ఇరువైపులా పొట్టకూటికోసం డ్రైనేజీ మీద షాపులు పెట్టుకొని  బ్రతికే కార్మికుల మీద పంచాయతీ కన్ను వేసి తక్షణమే ఖాళీ చేయాలని ప్రతి ఒక్క షాపుకు నోటీసులు పంపించారు. అంటే కార్మికులను వారి కుటుంబాలను రోడ్డు మీద పడేవేయాలని నిర్ణయించుకుందా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్లాట్ఫారం మీద బ్రతికే వారిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు పరిస్థితి ఏంటి? వారి జీవనోపాధి ఏంటి అని అన్నారు కార్మికుల మీద కాదు మీ ప్రతాపం బడా బాబులు రోడ్డు పక్కల స్థలాలు ఆక్రమించుకున్న దొంగ పట్టాలు పుట్టించి వారి సొంత స్థలాలు లాగా చలామణి అవుతున్న వారి మీద చూపించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న సంతపాకల స్థలంలో షెడ్యూల్ నిర్మించి ప్లాట్ఫారం మీద బ్రతికే వారికి ఆసరా కల్పించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఎన్నో అవుతవుకలు ఉన్నాయి ఇల్లు లేని వారి కంటే ముందుగా ఇల్లు ఉన్న వారికే రెండు మూడు ఇల్లు ఇవ్వడం వడ్డీ వ్యాపారస్తులకు పార్టీ కొమ్ము కాసే వారికి తప్ప, ఇల్లు లేని వారికి మొండిచేయి చూపించారు ఇది ఒక ఎత్తు అయితే చనిపోయిన వారికి ఇల్లు కేటాయించడం ఇది మరీ విడ్డూరమన్నారు. మంత్రి శీనన్న మీరు చెప్పిన మాటలకు చేసే పనికి ఒక్కటి కూడా పొంతన లేవు గత ఆయాంలో ఇల్లు ఉన్న వారికి సర్వే చేసి అట్టి వారికి ఇల్లు ఇవ్వబొమన్నారు. అన్నా మరి మీ అనుచరులు దమ్ము పేటలో ఇల్లు లేని వారికి న్యాయం చేయకుండా వారికి వారే దోచుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయమని మండిపడ్డారు. ఇక్కడ డ్రైనేజీల మీద బ్రతికే వారిని ప్రత్యామ్యాయం చూపించాక అప్పుడు తొలగించమని అట్టి విధంగా కాకుండా వారిని వెంటనే తొలగిస్తే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నారు.

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >