Posted on 2026-06-13 11:25:04
సింగభూపాలెం చెరువు మట్టి అక్రమ తరలింపుపై రైతుల ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు నుంచి రైతుల పంట పొలాలకు తరలించాల్సిన సారవంతమైన తొలకాలు (చెరువు పూడిక మట్టి) ఇతర వ్యాపార అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువు మట్టి వ్యవసాయ భూములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పంటల దిగుబడి పెరగడానికి దోహదపడే ఈ మట్టిని రైతులకు అందించాల్సి ఉండగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్ల కోసం అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తూ, సహజ వనరులను వ్యాపార ప్రయోజనాలకు వినియోగించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు మట్టి తరలింపుపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని, దీని వెనుక అధికారుల లాలూచీ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
వెంటనే అధికారులు స్పందించి చెరువు మట్టి తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి, రైతుల ప్రయోజనాలను కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >