Posted on 2026-06-16 07:15:20
అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: సీపీ గౌష్ ఆలం.
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇందులో భాగంగా సోమవారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన మూడు భారీ అక్రమ ఇసుక డంప్లను పోలీసులు కనుగొని, సీజ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విలాసాగర్ పరిసర ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అక్కడికక్కడే పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.
ఒక పెద్ద ఇసుక డంప్లో సుమారు 100 ట్రాక్టర్ల లోడుల ఇసుకను గుర్తించారు.
మిగిలిన రెండు ఇసుక డంప్లలో కలిపి మరో 50 ట్రాక్టర్ల లోడుల ఇసుక నిల్వలను సీజ్ చేశారు. మొత్తంగా దాదాపు 150 ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుకతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >